Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly Elections 2023 : బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పులపాలైంది - రాజాసింగ్

TS Assembly Elections 2023 : బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పులపాలైంది - రాజాసింగ్

TS Assembly Elections 2023 : బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పులపాలైంది - రాజాసింగ్
X

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రజల్ని మోసం చేశారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణను బంగారుమయం చేస్తామని చెప్పి అప్పుల పాలు చేశారని విమర్శించారు. కరీంనగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. బీఆర్ఎస్ పాలనపై ఫైర్ అయ్యారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నచోటే అభివృద్ధి జరుగుందని, అందుకే ప్రజలు ఒక్కసారి బీజేపీకి అవకాశమివ్వాలని రాజాసింగ్ కోరారు.

బీజేపీకి ఒక్కసారి అవకాశమిస్తే బంగారు తెలంగాణ చేసి చూపిస్తామని రాజాసింగ్ చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన అవినీతే కనిపిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నఆయన.. కరీంనగర్ ఎమ్మెల్యేగా బండి సంజయ్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. అందరి ఆశీర్వాదంతోనే పార్టీ సస్పెన్షన్ ఎత్తివేసిందని, ఫస్ట్ లిస్ట్ లోనే చోటు దక్కిందని రాజాసింగ్ అన్నారు.




Updated : 23 Oct 2023 11:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top