Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : సీఎం సుడిగాలి పర్యటన.. నేడు ఆ జిల్లాల్లో పర్యటన

KCR : సీఎం సుడిగాలి పర్యటన.. నేడు ఆ జిల్లాల్లో పర్యటన

KCR : సీఎం సుడిగాలి పర్యటన.. నేడు ఆ జిల్లాల్లో పర్యటన
X

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే 67 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు ఏర్పాటు చేసి విజయవంతంగా పూర్తిచేసిన ఆయన.. విరామం లేని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ మొత్తం 4 నియోజకవర్గాల్లో సీఎం సుడిగాలి పర్యటన చేయనున్నారు. కేసీఆన్ షెడ్యూల్ లో రెండో విడత పర్యటనలో భాగంగా ఇవాళ.. మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరు నియోజకవర్గాల్లోని సభల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్ పూర్ సభకు మొదట వెళ్తారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని మరోసారి గెలిపించాలని ప్రజలను కోరతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు వికారాబాద్ చేరుకుని.. బ్లాక్ గ్రౌండ్ లో జరుగనున్న ప్రజాఆశీర్వాధ సభలో పాల్గొంటారు. తర్వాత జహీరాబాద్, పటాన్ చెరులో నిర్వహించే సభల్లో పాల్గొని ప్రజల ఆశీర్వాదం కోరనున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్, మంత్రి హరీశ్ రావు జిల్లాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలోని హుజుర్ నగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తారు. హరీశ్ రావు రంగారెడ్డి జిల్లాలో రోడ్ షో నిర్వహించనున్నారు.

Updated : 23 Nov 2023 4:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top