Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : ఎంపీ సీట్లన్నీ గెలుద్దాం.. ఢిల్లీలో తడాఖా చూపిద్దాం - సీఎం కేసీఆర్

KCR : ఎంపీ సీట్లన్నీ గెలుద్దాం.. ఢిల్లీలో తడాఖా చూపిద్దాం - సీఎం కేసీఆర్

KCR : ఎంపీ సీట్లన్నీ గెలుద్దాం.. ఢిల్లీలో తడాఖా చూపిద్దాం - సీఎం కేసీఆర్
X

థంబ్ : బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్లే..!

రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. మోడీ సర్కారుపై ఫైర్ అయ్యారు. బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్లేనని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీగానీ, నవోదయ పాఠశాల కానీ ఇవ్వలేదని మండిపడ్డారు. బీజేపీకి ఒక్క ఓటు వేసినా వేస్టేనన్న కేసీఆర్.. భవిష్యత్ అంతా ప్రాంతీయ పార్టీలదేనని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, అందులో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నాయని చెప్పారు. అందుకే రాష్ట్రంలోనే పార్లమెంటు సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ కు వచ్చేలా చేస్తే ఢిల్లీలో తడాఖా చూపించొచ్చని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ ప్రజల బాగు కోసమే బీఆర్ఎస్ పుట్టిందని కేసీఆర్ అన్నారు. ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యమని చెప్పారు. అందుకే ఓటు వేసేముందు ప్రజలు అన్నీ ఆలోచించి వేయాలని సూచించారు. అభ్యర్థులతో పాటు పార్టీల చరిత్ర, నడవడిక ఎలాంటిదో చూడాలని అన్నారు. తెలంగాణ రాకముందు ఎన్నో సమస్యలు ఉండేవని, కానీ పదేండ్లలో పూర్తిగా మారిపోయిందని కేసీఆర్ స్పష్టం చేశారు.




Updated : 16 Nov 2023 9:49 AM GMT
Tags:    
Next Story
Share it
Top