Home > తెలంగాణ > Telangana Elections 2023 > ఎన్నికల ప్రచారం మొదలెట్టిన కేసీఆర్ మనవడు హిమాన్షు

ఎన్నికల ప్రచారం మొదలెట్టిన కేసీఆర్ మనవడు హిమాన్షు

ఎన్నికల ప్రచారం మొదలెట్టిన కేసీఆర్ మనవడు హిమాన్షు
X

రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు నెల రోజుల గడువే ఉండటంతో పార్టీలన్నీ మేనిఫెస్టో, ప్రచారానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు సైతం తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ప్రతీ చోట ప్రభుత్వ సంక్షేమ పథకాల విశిష్టతను వివరిస్తున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టడంతో పాటు ‘కేసీఆర్ వన్స్ ఎగైన్’ అంటూ గత నాలుగైదు రోజులుగా ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈసారి ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. సోషల్ మీడియా వేదికగా పార్టీకి తనవంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.



గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్నాడు హిమాన్షు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను, కేసీఆర్ పరిపాలనను వివరిస్తూ పోస్టులు పెడుతున్నాడు. రెండ్రోజుల క్రితం అతడు పెట్టిన పోస్టు.. ఆసక్తికరంగా మారింది. కొన్ని నెలల క్రితం చిన్న సినిమాగా విడుదలై ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కార్తికేయ-2 చిత్రంలోని ఒక డైలాగ్‌ను సీఎం కేసీఆర్‌ను వీడియోలకు లింక్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఈ పోస్టుకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మళ్లీ కేసీఆరే గెలుస్తారని అంటుండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం హైదరాబాద్ నగరాన్నే అభివృద్ధి చేశారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి హిమాన్షు కూడా రాజకీయాల్లోకి రాకముందే పార్టీ గెలుపుకై తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. హిమాన్షు చేస్తున్న ఈ సోషల్ మీడియా ప్రచారం బీఆర్ఎస్‌కు ఎంతమేర పనిచేస్తుందో చూడాలి మరి...




Updated : 13 Oct 2023 8:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top