Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly Elections 2023 : స్ట్రాంగ్ రూంకు తాళం వేయలేదు.. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

TS Assembly Elections 2023 : స్ట్రాంగ్ రూంకు తాళం వేయలేదు.. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

TS Assembly Elections 2023 :  స్ట్రాంగ్ రూంకు తాళం వేయలేదు.. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
X

తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్కు అంతా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ రోజు వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు స్ట్రాంగ్ రూంకు తరలించలేదు. కొద్దిసేపటి క్రితం పోస్టల్ బ్యాలెట్లను తరలించి స్ట్రాంగ్ రూంకు సీల్ వేశారు. పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్‌ రూంకు తాళం లేకపోవడంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూంకు తాళం వేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై ఆర్డీవోని నిలదీయగా.. ఉద్రిక్తత చోటుచేసుకుంది.


Updated : 2 Dec 2023 3:50 PM GMT
Tags:    
Next Story
Share it
Top