Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly Elections 2023 : మా వినతుల్ని మేనిఫెస్టోలో చేర్చండి: జర్నలిస్ట్ అధ్యయన వేదిక

TS Assembly Elections 2023 : మా వినతుల్ని మేనిఫెస్టోలో చేర్చండి: జర్నలిస్ట్ అధ్యయన వేదిక

TS Assembly Elections 2023 : మా వినతుల్ని మేనిఫెస్టోలో చేర్చండి: జర్నలిస్ట్ అధ్యయన వేదిక
X

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక సభ్యులు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమానికి సంబంధించి 9 ప్రధాన అంశాలను ఆ వినతి పత్రంలో ద్వారా రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించే ఎన్నికల మేనిఫెస్టోలో.. తమ వినతులను పొందుపరిచాలని జర్నలిస్టుల అధ్యయన వేదిక సభ్యులు కోరారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల అధ్యయన వేదిక సభ్యుల వినతులకు.. రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. వాటిని పరిశీలించి, మేనిఫెస్టోలో చేర్చుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని రేవంత్ హామీ ఇచ్చారు.




Updated : 16 Oct 2023 1:51 PM GMT
Tags:    
Next Story
Share it
Top