Home > తెలంగాణ > Telangana Elections 2023 > నేడు హైదరాబాద్కు మోదీ.. ఈ రూట్ బంద్

నేడు హైదరాబాద్కు మోదీ.. ఈ రూట్ బంద్

నేడు హైదరాబాద్కు మోదీ.. ఈ రూట్ బంద్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారంకోసం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. నేడు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల విశ్వరూప మహాసభకు హాజరుకానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4:45 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. ఈ సభలో ఎస్సీ కులాల వర్గీకరణపై మోదీ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ వర్గాలను ఆకట్టుకునేలా ప్రధాని ప్రకటనలు ఉంటాయని సమాచారం.

తెలంగాణలో ఎస్సీ జనాభాలో మాదిగ కులస్థులు 60శాతం ఉన్నారు. 20 నుంచి 25 నియోజకవర్గాల్లో వీరిదీ కీలక ఓటు బ్యాంక్. కాగా, ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు సంగీత్ ఎక్స్ రోడ్ నుంచి బేగంపేట రూట్లో ఆంక్షలు అమల్లో ఉంటాయి. కావున వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్ చూసుకోవాలని పోలీసులు ప్రకటనలో సూచించారు.

Updated : 11 Nov 2023 2:40 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top