Home > తెలంగాణ > Telangana Elections 2023 > Durgam Chinnaiah : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు

Durgam Chinnaiah : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు

Durgam Chinnaiah : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 70 శాతం పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు నమోదైంది. ఎలక్షన్ కోడ్ ను అతిక్రమించారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పోలింగ్ సందర్భంగా చిన్నయ్య బీఆర్ఎస్ కండువాతో వెళ్లి ఓటేశారు. దీంతో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని విమర్శలు రావడంతో.. ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాగే కండువాతో ఓటేసిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై ఇప్పటికే కేసు నమోదైన విషయం తెలిసిందే. నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఓటేసిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఎల్లపెల్లిలో పార్టీ కండువాతో మంత్రి ఓటేశారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిర్మల్‌ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పార్టీ గుర్తులు కనిపించేలా చేయటం, ఫలనా గుర్తుకు ఓటు వేయాలని చెప్పటం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది. దీంతో మంత్రిపై కేసు నమోదైంది.




Updated : 1 Dec 2023 5:51 AM GMT
Tags:    
Next Story
Share it
Top