Home > తెలంగాణ > Telangana Elections 2023 > Revanth Reddy : కొడంగల్ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపుతా : రేవంత్

Revanth Reddy : కొడంగల్ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపుతా : రేవంత్

Revanth Reddy  : కొడంగల్ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపుతా : రేవంత్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా చాటింది. ఇప్పటికే 53స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ మరో 12 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇక కొడంగల్ నుంచి పోటీ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా కొడంగల్ ప్రజలకు రేవంత్ ధన్యవాదాలు తెలపుతూ ట్వీట్ చేశారు.‘‘ ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా. దేశానికి కొడంగల్ను ఒక మోడల్గా నిలబెడతా’’ అని రేవంత్ ట్వీట్ చేశారు.


Updated : 3 Dec 2023 1:45 PM GMT
Tags:    
Next Story
Share it
Top