Home > తెలంగాణ > Telangana Elections 2023 > Revanth Reddy : కేసీఆర్.. తెలంగాణకు కాంగ్రెస్ ఏం తెచ్చిందో గుర్తు లేదా..? - సీఎం కేసీఆర్

Revanth Reddy : కేసీఆర్.. తెలంగాణకు కాంగ్రెస్ ఏం తెచ్చిందో గుర్తు లేదా..? - సీఎం కేసీఆర్

Revanth Reddy : కేసీఆర్.. తెలంగాణకు కాంగ్రెస్ ఏం తెచ్చిందో గుర్తు లేదా..? - సీఎం కేసీఆర్
X

అధికారంలో ఉన్న పదేండ్లలో ఒక్క హామీ నెరవేర్చని కేసీఆర్ మళ్లీ మూడోసారి అధికారం కోసం వస్తున్నాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆయనకు ప్రజలే బుద్ది చెప్పాలని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో మాట్లాడిన ఆయన.. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి భూకబ్జా చేశారని ఆరోపించారు. మల్లారెడ్డి కాలేజీలు పెట్టుకునేందుకు అనుమతులిచ్చిన కేసీఆర్... మేడ్చల్‌లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మాత్రం పెట్టలేదని ఫైర్ అయ్యారు. తెలంగాణలో అన్ని వర్గాలను మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు, విమానాశ్రయం తెచ్చింది కాంగ్రెస్ కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చింది, హైదరాబాద్‌కు కృష్ణ జలాలు తెచ్చింది కాంగ్రెస్ అన్న విషయం గుర్తు లేదా అని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోయుంటే కేసీఆర్, ఆయన కుటుంబ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో దొరలకు, ప్రజలకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ప్రజల తెంగాణ రావాలంటే దొరల తెలంగాణ కూలిపోవాలని అన్నారు. తాము అధికారంలోకి రాగానే మేడ్చల్‌కు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తేవడంతో పాటు పేదలకు రూ.500 లకే సిలిండర్, భూమి ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు.




Updated : 16 Nov 2023 11:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top