Home > తెలంగాణ > Telangana Elections 2023 > అసంతృప్తులకు బుజ్జగింపు.. టికెట్ దక్కని వారికి కార్పొరేషన్ పదవులు
అసంతృప్తులకు బుజ్జగింపు.. టికెట్ దక్కని వారికి కార్పొరేషన్ పదవులు
Bharath | 5 Oct 2023 5:10 PM GMT
X
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే టికెట్ రాని, అసంతృప్తితో ఉన్న లీడర్లను బుజ్జగించే పనిలో పడింది బీఆర్ఎస్. అందులో భాగంగానే తాజాగా కార్పొరేషన్ చైర్మన్ ల నియామకం చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ రైతు బంధు చైర్మన్గా తాటి కొండ రాజయ్య, రాష్ట్ర ఎంబీసీ చైర్మన్గా నందికంటి శ్రీధర్ నియమితులయ్యారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఉప్పల వెంకటేశ్ కు బాధ్యతలు అప్పజెప్పారు. వీరి నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.
Updated : 5 Oct 2023 5:10 PM GMT
Tags: TS Govt cm kcr new Corporation Chairmans TSRTC Chairman Muthireddy Yadagiri Reddy Telangana Rythu Bandhu Chairman TatiKonda Rajaiah State MBC Chairman Nandikanti Sridhar Mission Bhagiratha Vice Chairman Uppala Venkatesh
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire