Home > తెలంగాణ > Telangana Elections 2023 > Vijayashanthi : కేసీఆర్ వల్ల రాష్ట్ర ప్రజలు తల దించుకునే పరిస్థితి.. విజయశాంతి

Vijayashanthi : కేసీఆర్ వల్ల రాష్ట్ర ప్రజలు తల దించుకునే పరిస్థితి.. విజయశాంతి

Vijayashanthi  : కేసీఆర్ వల్ల రాష్ట్ర ప్రజలు తల దించుకునే పరిస్థితి.. విజయశాంతి
X

సీఎం కేసీఆర్‌ను గద్దె దించితెనే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి. కేసీఆర్ వల్ల రాష్ట్ర ప్రజలు తల దించుకునే పరిస్థితి ఏర్పడిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తల ఎత్తుకునేలా చేస్తామని చెప్పారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావుకు మద్ధతుగా ప్రచారం చేశారు విజయశాంతి. ఈ సందర్భంగా స్థానిక రాందాస్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కేసీఆర్ అధోపాతానికి తీసుకు వెళ్ళాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దిగజార్చి మూడో సారి మళ్ళీ ఓట్లు అడిగేందుకు వస్తున్నాడని, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.

తెలంగాణకి సీఎం కేసీఆర్ ఏం చేశారని ఓటు వేయాలి..? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములు కబ్జా చేసినందుకా, నిరుద్యోగ భృతి ఇవ్వందుకా, వందల రైతులు ఆత్మహత్యలకా? బెల్ట్ షాపులు పెట్టి అక్క చెల్లెళ్ళ తాళిబొట్టు తెంపినందుకు ఓటువేయలా..? అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో విచ్చల విడిగా డ్రగ్స్ అమ్ముతున్నాడని, పసి పిల్లలకు చాక్లెట్ గంజాయి అలవాటు చేశారని ఆరోపించారు. చెరువులు కబ్జా చేసి, ప్రాజెక్టుల పేరుతో రైతులను నిరాశ్రయులను చేసి నడి రోడ్డు పై నిలబెట్టిన ఘనత కేసీఆర్ కు దక్కిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు ఒకటేనని, ప్రజలని మోసం చేసేందుకు కలిసి నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో కవిత హస్తం ఉన్న కేంద్రం ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పే బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ కేసీఆర్ అవినీతి పై మాట్లాడుతది కానీ చర్యలు ఉండవన్నారు. తాము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటే చాలు అన్న ఒకే ఒక్క కారణంతో ఇంకా కొట్లాడుతున్నానని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీతో తెలంగాణా ఏ మాత్రం తెలంగాణ అభివృద్ధి చెందదని, కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. తమ ముందు ఉంది ఏకైక లక్ష్యమని, కేసీఆర్ సర్కార్ ను కూలగొట్టటమే తమ కర్తవ్యమని విజయశాంతి పేర్కొన్నారు. ఫామ్ హౌస్‌లో ఉండి ప్రజలను కలవని కేసీఆర్ ను గద్దె దించే వరకు నిద్రపొనని అన్నారు.




Updated : 22 Nov 2023 2:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top