Home > వైరల్ > మరీ ఇంత అమాయకత్వమా.. తల్లి మృతదేహంతో చర్చికి

మరీ ఇంత అమాయకత్వమా.. తల్లి మృతదేహంతో చర్చికి

మరీ ఇంత అమాయకత్వమా.. తల్లి మృతదేహంతో చర్చికి
X

నమ్మకానికి మూడ నమ్మకానికి సన్నని గీత ఉంటుంది. అయితే మనం చేసే పనులతో.. ఆ గీతకు ఎటువైపున్నామని తెలుస్తుంది. దేవున్ని కొలవటం ఒక నమ్మకం.. కానీ, అదే దేవుడిని ప్రార్థించే వ్యక్తికి శక్తులున్నాయని, ఆయన తాకితే సమస్యలు తొలగిపోతాయని అనుకోవడం మూడనమ్మకం. ఈ మధ్య మూడాచారను నమ్మేవాళ్లు పెరిగిపోయారు. చదువుకున్న వాడు, చదువు లేని వాడనే తేడా లేకుండా.. బాబాల చుట్టూ తిరుగుతున్నారు. చర్చిలో పాస్టర్ చూపే మహిమలకు ఆకర్శితుడైన వ్యక్తి తన తల్లి శవాన్ని వెంటబెట్టుకుని పాస్టర్ దగ్గరికి వచ్చిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగింది.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆ వ్యక్తి టీవీలో ఎప్పుడూ బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ కుమార్ చూపే మహిమలకు ఆకర్షితుడయ్యాడు. పాస్టర్ పై వీర భక్తిని పెంచుకున్నాడు. తన తల్లి అనారోగ్యం బారిన పడటంతో మొదట హైదరాబాద్ కు తీసుకొచ్చి చికిత్స అందించాడు. నాలుగు రోజులైనా ఏ మార్పు లేకపోవడంతో బెల్లంపల్లిలోని పాస్టర్ ప్రవీణ్ దగ్గరికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అంతలోనే ఆ వ్యక్తి తల్లి మరణించింది. అయినా పాస్టర్ పై ఉన్న నమ్మకం, ఆయన ఎలాగైనా బ్రతికిస్తాడనే ఆశతో తన తల్లి శవాన్ని తీసుకుని హైదరాబాద్ నుంచి బెల్లంపల్లి చర్చికి వచ్చాడు.

పాస్టర్ చెయి తాకితే తన తల్లి లేచి కూర్చుంటుందని నమ్మాడు. అయితే అక్కడి సిబ్భంది అంబులెన్స్ ను, అందులో ఉన్న శవాన్ని చర్చిలోపలికి అనుమతించలేదు. అయినా పట్టు వదలని అతను.. గంటల తరబడి శవంతో చర్చి ముందే ఉండిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు చర్చి దగ్గరికి చేరుకుని అతన్ని మందలించారు. తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి ఏపీకి పంపించారు. పోలీస్ విచారణలో అతను బీటెక్ చదివినట్లు తెలిసింది.



Updated : 25 Aug 2023 1:13 PM GMT
Tags:    
Next Story
Share it
Top