Home > వైరల్ > భారత్ మాతాకు జై అంటున్న సీమా హైదర్..ఫోటోలు, వీడియోలు వైరల్

భారత్ మాతాకు జై అంటున్న సీమా హైదర్..ఫోటోలు, వీడియోలు వైరల్

భారత్ మాతాకు జై అంటున్న సీమా హైదర్..ఫోటోలు, వీడియోలు వైరల్
X

పబ్జీ ఆటలో పరిచయమైన తన ప్రియుడు సచిన్ కోసం పాకిస్థాన్ బార్డర్ దాటి వచ్చిన మహిళ సీమా హైదర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‎గా మారింది. పాకిస్థానీ మహిళ అయినప్పటికీ భారత్ మాతాకు జై కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. జాతీయ జెండా రంగు చీరను కట్టుకుని భుజాన జెండాను కప్పుకుని హిందుస్థాన్ హే మేరా అంటూ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని అందరినీ షాక్‎కు గురిచేసింది. ఓ పాక్ మహిళ భారత్ మాతాకి జై కొట్టడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమెకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత్ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జరుగుతోంది. నోయిడాలో జరిగిన ఈ కార్యక్రమంలో తన ప్రియుడి సచిన్, పిల్లలు, లాయర్‎తో కలిసి పాక్ మహిళ సీమా హైదర్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంది. కుటుంబమంతా కలిసికట్టుగా త్రివర్ణ పతాకాన్ని తమ ఇంటిపై ఎగరవేశారు. ఈ వేడుకలకు సంబంధించిన పిక్స్, వీడియోలను నెట్టింట్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.

పబ్జీ ప్రియుడు సచిన్‎ను పెళ్లి చేసుకుని తాను ఇండియన్‎గా మారిపోయానని సీమా హైదర్ అంటోంది. భారత్ మాత తనకు కూడా తల్లేనని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇకపై తాను పాకిస్థాన్‎కు వెళ్లబోనని క్లారిటీ ిచ్చింది. తనకు భారత పౌరసత్వం ఇవ్వాలంటూ సీమా హైదర్ రీసెంట్‎గా రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకుంది.

సచిన్, సీమా హైదర్ ప్రేమ వ్యవహారం అటు పాక్ , ఇటు ఇండియాలో చాలా ఫేమస్ అయ్యింది. వీరిద్దరి గురించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట్లో ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. వీరి లవ్ స్టోర్ ఇన్స్పిరేషన్‎తో ఫిల్మ్ మేకర్స్ సినిమా కూడా నిర్మిస్తున్నారు.

‘కరాచీ టు నోయిడా’ అనే సినిమా తీస్తున్నట్లు ఇప్పటికే నోయిడాకు చెందిన ప్రొడ్యూజర్ అమిత్ జానీ అనౌన్స్ చేశారు. ఈ మూవీలో కథానాయకిగా సీమాను నటించాలని కోరగా ఆ ఆఫర్‎ను సీమా నిరాకరించినట్లు సమాచారం. ఇదే క్రమంలో సీమాతో సినిమాలు తీసే ప్రయత్నం ఎట్టిపరిస్థితుల్లో చేయవద్దంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన హెచ్చరికలు జారీ చేసింది.

Updated : 14 Aug 2023 9:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top