Home > ఆంధ్రప్రదేశ్ > నారా లోకేశ్కు ఏపీ సీఐడీ నోటీసులు

నారా లోకేశ్కు ఏపీ సీఐడీ నోటీసులు

నారా లోకేశ్కు ఏపీ సీఐడీ నోటీసులు
X

రెడ్ బుక్ వ్యవహారంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. రెడ్ బుక్ పేరుతో నారా లోకేశ్ తమని బెదిరిస్తున్నారని సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం సూచన మేరకు సీఐడీ అధికారులు లోకేశ్ కు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్నట్టు వాట్సాప్ లో సీఐడీకి లోకేశ్ బదులిచ్చారు. కాగా, అధికారుల పిటిషన్ పై విచారణను ఏసీబీ కోర్టు జనవరి 9కి వాయిదా వేసింది. కాగా యువగళం పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ యువనేత నారా లోకేశ్ చేతిలో ఓ ఎర్రని పుస్తకం ఉండడం తెలిసిందే. తమను, తమ పార్టీ క్యాడర్ ను ఇబ్బంది పెట్టిన పోలీసులు, అధికారులు, నేతల పేర్లను ఆ రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల సంగతి తానే స్వయంగా చూసుకుంటానని లోకేశ్ పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీఐడీ అధికారులు కోర్టును ఆశ్రయించారు.


Updated : 29 Dec 2023 11:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top