Home > ఆంధ్రప్రదేశ్ > షర్మిల కొడుకు రిసెప్షన్ కు హాజరైన సీఎం రేవంత్, ఖర్గే

షర్మిల కొడుకు రిసెప్షన్ కు హాజరైన సీఎం రేవంత్, ఖర్గే

షర్మిల కొడుకు రిసెప్షన్ కు హాజరైన సీఎం రేవంత్, ఖర్గే
X

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఇటీవల జైపూర్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా ఇవాళ షర్మిల శంషాబాద్ లోని ఫోర్ట్ గ్రాండ్ హోటల్ లో తన కుమారుడి పెళ్లి రిసెప్షన్ ను ఏర్పాటు చేయగా.. ఈ వేడకకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి షర్మిల ఘనస్వాగతం పలికారు. అనంతరం ఖర్గే, సీఎం రేవంత్, కేసీ వేణుగోపాల్ నూతన దంపతులు రాజారెడ్డి-ప్రియాలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహావేడుక రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ ప్యాలెస్‌లో ఈ నెల 16 నుంచి 18 వరకు ఘనంగా జరిగింది. 16న సంగీత్‌, 17న హల్దీ, 18న తలంబ్రాలు, విందు వైభవంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను షర్మిల సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా షర్మిల ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఒక తల్లిగా తన జీవితంలో మరో సంతోషకరమైన క్షణాన్ని చేరుకున్నట్లు ఆమె తెలిపారు. ‘ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది, ఆత్మీయుల శుభాకాంక్షలు, ఆశీర్వాదం, దేవుడి కరుణ. నా కుమారుడి తన జీవితపు ప్రేమ (ప్రియా)తో వివాహం చేసుకున్నందున కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలు కలకాలం గుర్తుండిపోతాయి’ అని షర్మిల పేర్కొన్నారు. ఇక షర్మిల షేర్ చేసిన ఫోటోల్లో కొత్త దంపతులు రాజారెడ్డి-ప్రియాతో పాటు వైఎస్‌ విజయమ్మ, షర్మిల-అనిల్‌ దంపతులు, కూతురు అంజలి, వధువు అట్లూరి ప్రియా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉన్నారు.


Updated : 24 Feb 2024 4:25 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top