Home > ఆంధ్రప్రదేశ్ > YS Sharmila : తెలంగాణ గవర్నర్ను కలిసిన వైఎస్ షర్మిల

YS Sharmila : తెలంగాణ గవర్నర్ను కలిసిన వైఎస్ షర్మిల

YS Sharmila  : తెలంగాణ గవర్నర్ను కలిసిన వైఎస్ షర్మిల
X

కాంగ్రెస్​ నాయకురాలు వైఎస్‌ షర్మిల తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిశారు. మంగళవారం రాజ్ భవన్ కు వచ్చిన షర్మిల.. తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం, వివాహానికి రావాలని గవర్నర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా గవర్నర్ కు నిశ్చితార్థ, వివాహా ఆహ్వానపత్రికను అందజేశారు. కాగా షర్మిల తనయుడు రాజా రెడ్డికి అట్లూరి ప్రియతో ఈనెల 18న నిశ్చితార్థం జరగనున్న విషయం తెలిసిందే. ఇక వివాహానికి కూడా ముహూర్తం పెట్టేశారు. ఫిబ్రవరి 17న వారి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో షర్మిల పలువురికి వివాహ ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు. ఇటీవల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద తొలి ఆహ్వాన పత్రికను ఉంచి.. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. కాబోయే వధూవరులను కూడా అక్కడికి తీసుకెళ్లారు. ఆ తర్వాత తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌ ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. తాజాగా తెలంగాణ గవర్నర్ కు వివాహ ఆహ్వాన పత్రికను అందించిన షర్మిల.. త్వరలోనే మాజీ సీఎం చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాన్ లను కలిసి కుమారుడి వెడ్డింగ్ కార్డు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.



Updated : 9 Jan 2024 1:59 PM GMT
Tags:    
Next Story
Share it
Top