Home > ఆంధ్రప్రదేశ్ > పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప: Nara Lokesh

పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప: Nara Lokesh

పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప: Nara Lokesh
X

పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారిందని అన్నారు. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశాడని ఆరోపించారు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, వలంటీర్లతో అన్ని వర్గాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారని అన్నారు. అందుకే వారంత తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ పూర్తి మద్దతు ఇస్తోందని అని స్పష్టం చేశారు. అంగన్వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మద్దతు తెలిపాయో అలానే స మున్సిపల్, ఆశా వర్కర్ల పోరాటానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు

Updated : 26 Dec 2023 9:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top