Home > ఆంధ్రప్రదేశ్ > ఆ ముగ్గురిపై ఆర్జీవీ పోలీస్ కంప్లైంట్

ఆ ముగ్గురిపై ఆర్జీవీ పోలీస్ కంప్లైంట్

ఆ ముగ్గురిపై ఆర్జీవీ పోలీస్ కంప్లైంట్
X

టీడీపీ నేత కోలికపూడి శ్రీనివాసరావు, టీవీ 5 ఛానల్ యజమాని బీఆర్ నాయుడు, ఆ ఛానల్ న్యూస్ యాంకర్ సాంబశివ రావుపై రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి కంప్లైంట్ చేశారు. శ్రీనివాసరావు లైవ్ టీవీలో తనను చంపి తలను తెచ్చిన వాళ్లకు కోటి రూపాయలు ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తన ఇంటికొచ్చి తనను తగలబెడతానని పబ్లిక్ గా బెదిరించాడని తెలిపారు. నివారిస్తున్నట్టు నటిస్తూనే యాంకర్ సాంబశివ రావు శ్రీనివాసరావును తనపై ఉసిగొల్పేందుకు ప్రయత్నించారని అన్నారు. మూడు సార్లు తనను చంపుతానని శ్రీనివాసరావు అన్నా కూడా అతిని సాంబశివరావు చర్చను కొనసాగించాడని అన్నారు.

దీన్ని బట్టి వాళ్లిద్దరూ తనను చంపటానికి కాంట్రాక్ట్ ఇవ్వటానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్ గా అర్ధమవుతోందని ఆర్జీవి తెలిపారు. ఇలాంటి హత్య కుట్రలు తన ఛానల్‌లో ప్రసారమవుతున్నాయని తెలిసి కూడా సాంబశివ రావును వెంటనే జాబ్ నుంచి తీసెయ్యలేదంటే ఛానల్ ఓనర్ బీఆర్ నాయుడు కూడా ఈ కుట్రలో భాగంగా ఉన్నట్టు క్లియర్ గా తెలిసిపోతోందని అన్నారు. ఒక డెమోక్రసీ లొ హత్యా కాంట్రాక్టులు ఇంత పబ్లిక్ గా ఇవ్వటం చూస్తే టెర్రరిస్టుల కూడా షాక్ అవుతారని అన్నారు. కావున వెంటనే పై ముగ్గురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్జీవీ డీజేపీని కోరారు.

Updated : 27 Dec 2023 4:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top