Home > ఆంధ్రప్రదేశ్ > జగన్ వేసింది దగా డీఎస్సీ.. APCC Chief Sharmila

జగన్ వేసింది దగా డీఎస్సీ.. APCC Chief Sharmila

జగన్ వేసింది దగా డీఎస్సీ..  APCC Chief Sharmila
X

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు చేశారు. మహానేత వైఎస్ఆర్ 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే...వారసుడు గా చెప్పుకొనే జగన్ ఆన్న 6 వేలతో డీఎస్సీ వేసి నిరుద్యోగులను దగా చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు పలు ప్రశ్నలు సంధించారు. నవ రత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకొనే జగన్, ఆయన చుట్టూ ఉండే సకలం శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.

వైసీపీ ప్రభుత్వానికి షర్మిల వేసిన ప్రశ్నలు ఇవే..

1. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 25 వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ ?

2. 5 ఏళ్లు నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన ఎందుకు చేశారు ?

3. ఎన్నికలకు నెలన్నర ముందు 6 వేల పోస్టుల భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి ?

4. టెట్, డీఎస్సీ కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి ?

5. నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా ? టెట్ కి 20 రోజులు, తర్వాత డీఎస్సీ మద్య కేవలం 6 రోజుల వ్యవధినా ?

6. వైఎస్ఆర్ హయాంలో 100 రోజుల గడువు ఇచ్చిన సంగతి వారసుడు జగన్ కి గుర్తులేదా ?

7. ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థి 150 పుస్తకాలు చదవాలని మీకు తెలియదా ?

8.రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా ?

9. మానసిక ఒత్తిడికి గురిచేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ? ఇది కక్ష్య సాధింపు చర్య కాదా?

Updated : 13 Feb 2024 9:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top