Home > జాతీయం > ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు

ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో జనం పరుగులు
X

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం భూప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడంతో జనం భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. పంజాబ్, చంఢీగఢ్, ఘజియాబాద్‌, జమ్ముకశ్మీర్‌ లోనూ భూమి కంపించింది. అలాగే పాకిస్తాన్ లోని లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్ పక్తుంక్వాలో ప్రకంపనలు వచ్చాయి. ఇస్లామాబాద్‌లోను భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.0గా నమోదైంది. అయితే ఈ ప్రకంపనల వల్ల పెద్ద ప్రమాదమేమీ సంభవించలేదని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.




Updated : 11 Jan 2024 3:41 PM IST
Tags:    
Next Story
Share it
Top