Home > జాతీయం > Cotton Candy : తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం.. ఎందుకంటే?

Cotton Candy : తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం.. ఎందుకంటే?

Cotton Candy : తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం.. ఎందుకంటే?
X

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి (కాటన్‌ క్యాండీ) విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాల వాడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ తెలిపారు. వీటిల్లో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పీచు మిఠాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటికే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాటన్‌ క్యాండీపై నిషేధం అమల్లో ఉంది.పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు ఇటీవల ఫుడ్‌ సేఫ్టీ విభాగ అధికారులు చెన్నై వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో స్వాధీనం చేసుకున్న పీచు మిఠాయి నమూనాలను అధ్యయనం చేయగా కాటన్‌ క్యాండీల్లో రోడమైన్‌-బీ అనే కెమికల్‌ను వారు గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగించినట్లు తేలింది.

కాగా పీచు మిఠాయిలో వాడుతున్న ఈ 'రోడమైన్‌-బీ'ని ‘ఇండస్ట్రియల్‌ డై’గా పిలుస్తారు. అంటే దుస్తుల కలరింగ్‌, పేపర్‌ ప్రింటింగ్‌లో ఎక్కువగా వినియోగిస్తారు. ఫుడ్‌ కలరింగ్‌ కోసం దీన్ని ఉపయోగించే అవకాశం లేదు. అయితే కొందరు తమ స్వార్ధం కోసం ఫుడ్ లో వాడుతున్నారని, దీనివల్ల దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ఇది ఎక్కువ మొత్తంలో మన శరీరంలోకి వెళ్తే కిడ్నీ, లివర్‌ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని, అల్సర్‌ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పీచు మిఠాయి తినకుండా పిల్లలపై దృష్టిపెట్టాలని తమిళనాడు ప్రభుత్వం ప్రజలను కోరింది.

Updated : 17 Feb 2024 2:49 PM GMT
Tags:    
Next Story
Share it
Top