Home > జాతీయం > Ram Mandir : అయోధ్య ట్రస్ట్ నో చెప్పిన రాముడి విగ్రహం ఇదే

Ram Mandir : అయోధ్య ట్రస్ట్ నో చెప్పిన రాముడి విగ్రహం ఇదే

Ram Mandir : అయోధ్య ట్రస్ట్ నో చెప్పిన రాముడి విగ్రహం ఇదే
X

అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో సోమవారం నాడు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రధాని మోడీ చేతులమీదుగా జరిగింది. రాముడి ప్రాణ ప్రతిష్ఠతో దేశమంతా భక్తిభావంతో పులకించిపోయింది. కాగా అయోధ్య రామ మందిరంలోని రాముడి విగ్రహం తయారీ కోసం దేశంలో ప్రతిభావంతులైన పలు శిల్పాకారులకు శ్రీ రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర్ ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. వారిలో నుంచి 10 మందిని ఎంపిక చేసి చివరికి ముగ్గురిని విగ్రహాలు తయారు చేయాలని కోరింది. ఇక చివరిగా అయోధ్య రామాలయంలోని గర్భగుడిలో మైసూరుకు చెందిన 38 ఏళ్ల అరుణ్ యోగిరాజ్ నల్లరాతితో చెక్కిన బాల రాముడివైపే అయోధ్య ట్రస్ట్ మొగ్గుచూపింది. ఈక్రమంలోనే ఆ విగ్రహాన్ని సోమవారం గర్భగుడిలో ప్రతిష్ఠించారు. అయితే గర్భగుడిలో పెట్టడానికి తిరస్కరణకు గురైన రెండు విగ్రహాల్లో ఓ విగ్రహానికి సంబంధించిన చిత్రాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ విగ్రహం ట్రస్ట్ వద్దనే ఉన్నది.

ఈ చిత్రంలో రామ్ లల్లా నిలబడి ఉండగా ఓ చేతిలో బంగారు బాణం.. మరో చేతిలో బంగారు విల్లు ఉన్నాయి. ఇక రాముడి వెనుక భాగంలో అర్ధ ఛతురాస్రాకారంపై విష్ణుమూర్తి దశావతారాలకు సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. బాల రాముడిని వివిధ అభరణాలు, దుస్తులతో అలంకరించిన ఈ విగ్రహం ఎంతోగానో ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని రాజస్థాన్ కు చెందిన సత్యనారాయణ పాండే అనే శిల్పి చెక్కారు. ఇక ఈ విగ్రహంతో పాటు తిరస్కరణకు గురైన కర్ణాటకకు చెందిన గణేశ్ భట్ చెక్కిన మరో విగ్రహాన్ని కూడా అయోధ్య రామమందిరంలో పెట్టనున్నారు. అయితే వాటిని గర్భగుడిలో కాకుండా గర్భగుడి వెలుపలి భాగంలో పెట్టనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకలు తెలిపారు.




Updated : 23 Jan 2024 1:55 PM GMT
Tags:    
Next Story
Share it
Top