Home > తెలంగాణ > ప్రజలను మభ్యపెట్టేలా హామీలిచ్చారు.. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

ప్రజలను మభ్యపెట్టేలా హామీలిచ్చారు.. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

ప్రజలను మభ్యపెట్టేలా హామీలిచ్చారు.. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
X

ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్, బీఆర్ఎస్ హామీలు ఇచ్చాయని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. సాధ్యమయ్యే హామీలనే బీజేపీ ఇచ్చిందని అన్నారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సభను తప్పుదారి పట్టించేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని అన్నారు. తెలంగాణను ప్రతి విషయంలో కేంద్రం ఆదుకుందని అన్నారు. 11 సాగునీటి ప్రాజెక్టుల కోసం కేంద్రం 2 వేల కోట్లు ఇచ్చిందని అన్నారు. గొర్రెల పంపిణీకి కేంద్రం నిధులిచ్చిందని అన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని అన్నారు. వైద్యం,విద్యను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. విద్యుత్ ను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మోటార్లకు మీటర్లు పెడుతున్నట్లు కేంద్రం ఏనాడు అనలేదని అన్నారు. ఆదాయంలో 30 శాతం జీతాలకే పోతోందని అన్నారు. ఆదాయం లేనిది ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పించారు.

Updated : 20 Dec 2023 10:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top