Home > తెలంగాణ > ఆ అవకాశం రావడం నా అదృష్టం.. బీజేపీ నేత బండి సంజయ్

ఆ అవకాశం రావడం నా అదృష్టం.. బీజేపీ నేత బండి సంజయ్

ఆ అవకాశం రావడం నా అదృష్టం.. బీజేపీ నేత బండి సంజయ్
X

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు అయోధ్యలోని శ్రీ రామ తీర్థ క్షేత్ర్ ట్రస్ట్ నుంచి పూజిత అక్షితలు, ఫోటో, కరపత్రం పంపించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. అయోధ్య శ్రీ రాముడి దగ్గరి నుంచి పూజిత అక్షతలు, ఫోటో, కరపత్రం అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ఆ సీతారామచంద్రుల అనుగ్రహం అందరిపైన ప్రసరించాలని, దేశమంతా రామమయం కావాలని అన్నారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో భవ్యమైన, దివ్యమైన రామమందిరం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆ రోజు అందరూ దీపావళి పండుగ జరుపుకోవాలని కోరారు. కాగా ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా దేశంలోని ప్రముఖులకు శ్రీ రామ తీర్థ క్షేత్ర్ ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది.

Updated : 1 Jan 2024 12:56 PM GMT
Tags:    
Next Story
Share it
Top