Home > తెలంగాణ > BRS MLA's : ఎమ్మెల్యే లాస్య నందిత పాడె మోసిన హరీశ్ రావు

BRS MLA's : ఎమ్మెల్యే లాస్య నందిత పాడె మోసిన హరీశ్ రావు

BRS MLAs  : ఎమ్మెల్యే లాస్య నందిత పాడె మోసిన హరీశ్ రావు
X

బీఆర్ఎస్ కు చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పటాన్ చెరు ఓఆర్ఆర్ వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదానికి గురై అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు సంతాపం ప్రకటించారు. ఎంతో భవిష్యత్తు ఉన్న లాస్య నందిత ఇలా అర్ధాంతరంగా మృతి చెందడం బాధాకరమని వారు అన్నారు. కాగా లాస్య నందిత అంత్యక్రియల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌషిక్ రెడ్డి లాస్య నందిని శవయాత్రలో పాల్గొని ఆమె పాడె మోశారు. ఇక తన తండ్రి, మాజీ ఎమ్మెల్యే సాయన్న సమాధి పక్కనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కాగా దివంగత నేత సాయన్న కుమార్తె అయిన లాస్య నందిత తండ్రి అడుగుజాడల్లోనే ఇటీవల కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందాక రెండు సార్లు ప్రమాదం ఆమెను వెంటాడింది. గతేడాది డిసెంబర్ లో సికింద్రాబాద్ లో ఓ కార్యక్రమానికి వెళ్లిన లాస్య లిఫ్ట్ లో ఇరుక్కుపోయి చాలా ఇబందిపడిన విషయం తెలిసిందే. అనంతరం ఇటీవల నల్గొండలో కేసీఆర్ సభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్ పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఎమ్మెల్యేగా గెలిచాక ఇలా రెండు సార్లు ప్రమాదం నుంచి బయటపట్ట లాస్య నందిత ఇవాళ జరిగిన ప్రమాదం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య.. ఇలా అర్ధాంతరంగానే తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించారు.




Updated : 23 Feb 2024 1:05 PM GMT
Tags:    
Next Story
Share it
Top