రాజేంద్రనగర్ SHOకు సీఎం రేవంత్ ప్రశంసలు
Vijay Kumar | 5 Jan 2024 11:36 AM GMT
X
X
దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ నిలిచింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ రిలీజ్ చేసిన దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ స్టేషన్ల జాబితాలో రాజేంద్ర నగర్ పీఎస్ మొదటిస్థానంలో నిలిచింది. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన డీజీపీల సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజేంద్ర నగర్ పీఎస్ ఎస్హెచ్వో బి.నాగేంద్రబాబుకు ట్రోఫీని అందజేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రాజేంద్ర నగర్ పీఎస్ ఎస్హెచ్వో నాగేంద్రబాబు, ఇతర సిబ్బందిని ప్రశంసించారు. తమ పనితీరుతో రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చారని అన్నారు. బాగా పని చేసే అధికారులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని సీఎం అన్నారు.
Updated : 5 Jan 2024 11:36 AM GMT
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire