Home > తెలంగాణ > సీఎంగా ముందే ప్రకటిస్తే మీరు గెలిచేవారే కారు.. కేటీఆర్ పై ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్

సీఎంగా ముందే ప్రకటిస్తే మీరు గెలిచేవారే కారు.. కేటీఆర్ పై ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్

సీఎంగా ముందే ప్రకటిస్తే మీరు గెలిచేవారే కారు.. కేటీఆర్ పై ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్
X

సీఏంగా రేవంత్ ను ముందే ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి కనీసం 35 సీట్లు కూడా వచ్చేవి కావన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. సీఎంగా రేవంత్ ను ముందే ప్రకటిస్తే కేసీఆర్, కేటీఆర్ కూడా ఓడిపోయేవారని అన్నారు. టీసీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగానే ఎన్నికల్లో ప్రచారం చేశారని అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా కేటీఆర్ మాటల్లో ఏమాత్రం అహంకారం తగ్గలేదని అన్నారు. రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే కాంగ్రెస్ కు 35 సీట్లు రావంటూ మాట్లాడటం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి కావడం వల్లే అప్పటి సీఎం కేసీఆర్ పై పోటీ చేశారని అన్నారు.

ఇచ్చిన మాట ప్రకారం 100రోజుల్లో అన్ని గ్యారంటీ లుఅమలు చేస్తామని, రేపు మరో రెండు గ్యారెంటీలు ప్రారంభిస్తామని తెలిపారు. అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన అందిస్తున్నామని అన్నారు. కేటీఆర్, కవిత లాగా రేవంత్ రెడ్డిది పేమెంట్ సీటు కాదని, రేవంత్ రెడ్డి ప్రజల నుంచి వచ్చిన నాయకుడని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరుకు జాతీయ హోదా అడగలేదని, కృష్ణా జలాలను ఏపీకి తరలించారని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నీళ్లపాలు చేశారని, ఆ ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు మళ్ళీ బుద్ది చెపుతారని అన్నారు. 17 లోక్ సభ స్థానాల్లో తాము మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Updated : 26 Feb 2024 12:34 PM GMT
Tags:    
Next Story
Share it
Top