Home > తెలంగాణ > త్వరలోనే ప్రజల్లోకి వస్తా.. మాజీ సీఎం కేసీఆర్

త్వరలోనే ప్రజల్లోకి వస్తా.. మాజీ సీఎం కేసీఆర్

త్వరలోనే ప్రజల్లోకి వస్తా.. మాజీ సీఎం కేసీఆర్
X

త్వరలోనే ప్రజల్లోకి వస్తున్నానని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్ర హక్కుల సాధన కోసం గళం విప్పాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.ఈ నెల చివరలో ప్రారంభమై వారం రోజులపాటు సాగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలని కేసీఆర్ ఎంపీలకు స్పష్టం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో వున్న రాష్ట్ర విభజన హామీల సాధనకోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసినా చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు.

కాగా నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాజ్యసభ, లోకసభ పార్లమెంటరీ పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావు సహా పార్టీ ఎంపీలు పోతుగంటి రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు పాల్గొన్నారు.


Updated : 26 Jan 2024 2:07 PM GMT
Tags:    
Next Story
Share it
Top