Home > తెలంగాణ > 2047 వరకు సూపర్ పవర్గా భారత్.. Kishan Reddy

2047 వరకు సూపర్ పవర్గా భారత్.. Kishan Reddy

2047 వరకు సూపర్ పవర్గా భారత్.. Kishan Reddy
X

దేశ ప్రజలు ప్రధానిగా మళ్లీ మోడీనే కావాలని అంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోడీ నేతృత్వంలో దేశంలో స్థిరమైన, సమర్థవంతమైన పాలన అందుతోందని అన్నారు. అంతర్జాతీయంగా దేశ గౌరవాన్ని మోడీ ఎన్నో రెట్లు పెంచారని అన్నారు. అవినీతిరహిత పాలనతో మోడీ దేశాన్ని అభివృవృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని అన్నారు. కానీ కాంగ్రెస్ హయాంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, ఎంతో మంది మంత్రులు నాడు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లారని అన్నారు. కాంగ్రెస్ హయాంలో మొత్తం 12 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని అన్నారు. కానీ మోడీ పాలనలో ప్రజల అకౌంట్లోకి డబ్బు డైరెక్ట్ గా వెళ్తోందని అన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశంలోని ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరుతోందని అన్నారు. దీదీ డ్రోన్ పేరుతో దేశవ్యాప్తంగా 15 వేల గ్రామాల్లో రానున్న రోజుల్లో డ్రోన్ల ద్వారా పంట పొలాల్లో ఎరువులు చల్లే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.

వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలని చెప్పినట్లు తెలిపారు.రామగుండంలో ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి రైతులకు తక్కువ ధరకే ఎరువులు అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

2014కి ముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవని, కానీ మోడీ పాలనలో విద్యుత్ కోతలు లేని నూతన భారతాన్ని చూస్తున్నామని అన్నారు. మోడీకి ముందు దేశంలో ఎక్కడ చూసినా టెర్రరిస్టులు దాడులు చేసేవారని, కానీ వాటన్నింటినీ పూర్థిస్తాయిలో అరికట్టామని తెలిపారు. 2047 వరకు పేదరికం లేని దేశంగా భారత్ ను నిలిపేందుకు మోడీ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు కిషన్ రెడ్డి.

Updated : 3 Feb 2024 4:03 PM GMT
Tags:    
Next Story
Share it
Top