Home > తెలంగాణ > కాంగ్రెస్ పార్టీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. క్లారిటీ ఇదే

కాంగ్రెస్ పార్టీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. క్లారిటీ ఇదే

కాంగ్రెస్ పార్టీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. క్లారిటీ ఇదే
X

తాను, ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తాము సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లోకి వెళ్లామని బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని అన్నారు. కావాలనే తమపై బురద జల్లేందుకు గులాబీ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తమ సొంత చానెళ్లలో తనపై అబద్ధపు వార్తలు ప్రచారం చేయిస్తున్నారి ఆరోపించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని, అలాగే టీ న్యూస్ ను బీన్యూస్ అని గానీ లేక బీబీ న్యూస్ అని గానీ మార్చుకోండని బీఆర్ఎస్ పార్టీ నేతలను ఉద్దేశించి అన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, బీజేపీని వీడేదిలేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీకి ఈ సారి కూడా మెజారిటీ సీట్లు వచ్చి మూడోసారి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అన్నారు. ఇక వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 10 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని, కాంగ్రెస్ కు రెండు మూడు వస్తాయని అన్నారు.




Updated : 29 Dec 2023 12:54 PM GMT
Tags:    
Next Story
Share it
Top