Home > తెలంగాణ > ఐదోసారి ఎమ్మెల్యేగా కేటీఆర్ ప్రమాణం

ఐదోసారి ఎమ్మెల్యేగా కేటీఆర్ ప్రమాణం

ఐదోసారి ఎమ్మెల్యేగా కేటీఆర్ ప్రమాణం
X

మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికైన అనంతరం కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి తనను గెలిపించిన సిరిసిల్ల ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. తనకు ఐదోసారి ఆశీస్సులు అందించిన ప్రజలకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. తన గెలుపు కోసం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు యోధుల్లా పని చేశారని అన్నారు. వాళ్లందరకీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ప్రజల మద్దతుతో తమ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.

ఈసారి తమను ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు కోరారన్న కేటీఆర్.. ఆ పాత్రను సమర్థవంతంగా పోషిస్తామని అన్నారు. కాగా కేటీఆర్ కు ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం ఇది ఐదోసారి (2010లో జరిగిన ఉప ఎన్నికతో సహా). కాగా అసెంబ్లీలో అంతకుముందు కేటీఆర్ స్పీకర్ ఎన్నికలో పాల్గొన్నారు. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులతో కలిసి ప్రసాద్ కుమార్ ను ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన స్పీకర్ కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.


Updated : 14 Dec 2023 1:54 PM GMT
Tags:    
Next Story
Share it
Top