Home > తెలంగాణ > కేసీఆర్ పాలనలోనే కృష్ణా జలాల దోపిడీ ఎక్కువైంది.. మంత్రి జూపల్లి

కేసీఆర్ పాలనలోనే కృష్ణా జలాల దోపిడీ ఎక్కువైంది.. మంత్రి జూపల్లి

కేసీఆర్ పాలనలోనే కృష్ణా జలాల దోపిడీ ఎక్కువైంది.. మంత్రి జూపల్లి
X

కేసీఆర్ పాలనలోనే కృష్ణా జలాల్లో ఏపీ దోపిడీ ఎక్కువైందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో మనకు తీవ్ర అన్యాయం జరగడానికి కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కారణమని, కృష్ణా జలాల్లో తెలంగాకు రావాల్సిన వాటా విషయంలో రాజీపడేది లేదని అన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా గురించి సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని, రాష్ట్ర ప్రాజెక్ట్స్ ను కేఆర్ఎంబీకి అప్పగించబోమని అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కృష్ణా జలాల వాటాను 299:512 టీఎంసీలుగా 2015 నుంచి 2023 వరకు ఒప్పుకొని… ఇప్పుడు తాము చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు 50:50 నీటి వాటాపై పోరాడాలని నీతులు చెపుతున్నారని ద్వజమెత్తారు.

ఏపీ కేటాయింపును మించి వాడుకుందని, ఈ 299 టీఎంసీలను కూడా తొమ్మిదిన్నర ఏండ్లలో ఏ సంవత్సరం కూడా పూర్తిగా వినియోగించు కోలేకపోవడానికి గత ప్రభుత్వం కారణం కాదా అని ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో మన రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరగడానికి కారణం కేసిఆరేనని మంత్రి జూపల్లి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ నీళ్లు వాడుకుంటున్నా.. అప్పట్లో కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. రైతులపాలిట కేసిఆర్, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు ద్రోహులుగా నిలిచిపోతారని విమర్శించారు. కృష్ణా జలాల వినియోగ సామర్థ్యం పెంచటంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దక్షిణ తెలంగాణ దారుణంగా మోసపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులోనూ వివక్ష చూపారని, ఇత‌ర ప్రాజెక్ట్ ల కింద కాలువల పనులను చేపట్టకపోవడం, ప్రాజెక్టులను పూర్తిచేయకపోవడం మూలంగా జిల్లా ప్రజలకు సాగునీరు ఇస్తామన్న ప్రకటనలు కాగితాలకే పరిమతమయ్యాయని దుయ్యబట్టారు. కాల్వలు, పిల్ల కాల్వల పనులను కూడా పూర్తి చేయలేద‌ని, ఇప్పటివరకు చివరి ఆయకట్టుకు నీరందించలేకపోయారని అన్నారు. చేసిందంత చేసి బీఆర్ఎస్ నేతలు ఉమ్మ‌డి పాల‌మూర్ జిల్లా సాగునీటిపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇచ్చిన మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ అని అన్న మంత్రి.. ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని అన్నారు.




Updated : 22 Feb 2024 2:07 PM GMT
Tags:    
Next Story
Share it
Top