Home > తెలంగాణ > మైనారిటీలకు రక్షణ కల్పించాలి.. RS Praveen Kumar

మైనారిటీలకు రక్షణ కల్పించాలి.. RS Praveen Kumar

మైనారిటీలకు రక్షణ కల్పించాలి.. RS Praveen Kumar
X

రాష్ట్రంలోని మైనారిటీలకు రక్షణ కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జన్వాడలో క్రైస్తవులపై జరిగిన దాడిని ఖండిస్తూ శనివారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన శాంతియత ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మతం పేరుతో కొందరు మూకలు ఇతర మతాలవాళ్లపై దాడులు చేయడం సరికాదని అన్నారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన కొందరు వ్యక్తులు క్రైస్తవులు, దళితులపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. మత మైనారిటీలపై జరిగే దాడులు రాజ్యాంగ వ్యతిరేకమన్న ఆయన.. గుడి, చర్చి, మసీద్ మత ప్రచారకులపై జరిగే దాడులు చట్ట వ్యతిరేకమన్నారు. జన్వాడలో క్రైస్తవులు, దళితులపై జరిగిన దాడి చుండూరు, కారంచేడు లాంటిదేనని అన్నారు. ప్రభుత్వం నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రార్థన మందిరలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని అన్నారు. రాజ్యాంగంలో అధికరణ 25ను కాపాడాలన్నారు.

మణిపూర్ లో ఇటువంటి మతపరమైన దాడులు చేసి హత్యలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల కంటే మత మైనారిటీల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలన్నారు. అసెంబ్లీలో కేవలం కాళేశ్వరం లాంటి విషయాలపైననే చర్చనా..మైనారిటీలపై జరిగిన దాడిపై చర్చించరా అని ప్రశ్నించారు. ఇదేనా ప్రభుత్వం చెబుతున్న ప్రజా పాలన అంటూ ద్వజమెత్తారు. క్రైస్తవులు, దళితులపై చేసిన దాడులపై ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతమన్నారు. దాడులు జరిగిన సంఘటన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించకపోతే బాధితులకు న్యాయం ఇంకెక్కడ జరుగుతుందన్నారు.

Updated : 17 Feb 2024 9:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top