Home > తెలంగాణ > కొత్త బస్సులు వచ్చేస్తున్నాయ్.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్

కొత్త బస్సులు వచ్చేస్తున్నాయ్.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్

కొత్త బస్సులు వచ్చేస్తున్నాయ్.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్
X

రాష్ట్రంలోకి కొత్త బస్సులు వస్తున్నాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రేపు హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కొత్త బస్సులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు టీఎస్ఆర్టీసీ నిరంతరం కృషి చేస్తోందని, రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోందని అన్నారు. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించించామని తెలిపారు. వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయని, వీటికి తోడు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెస్తోందని చెప్పారు. ఈ బస్సులన్నీ విడతల వారీగా మార్చి 2024 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా సంస్థ ప్లాన్ చేసిందని, మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్‌ వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియోగించుకోనున్నామని తెలిపారు.

అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు శనివారం నుంచి వాడకంలోకి వస్తున్నాయన్న ఆయన.. వాటిలో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులున్నాయని తెలిపారు. ఈ కొత్త బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు ఉదయం 10 గంటలకు జరుగనుందని, తెలంగాణ రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి రవాణా, రహదారి మరియు భవనాల శాఖ కార్యదర్శి శ్రీ శ్రీనివాస రాజు, ఐఏఎస్, రవాణా శాఖ కమిషనర్‌ శ్రీ జ్యోతి బుద్దా ప్రకాశ్ తోపాటు టీఎస్‌ఆర్టీసీ ఎండీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతున్నారు.




Updated : 29 Dec 2023 11:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top