Home > తెలంగాణ > Sajjanar : నిన్న ఒక్కరోజే 52 లక్షల మంది ప్రయాణించారు.. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Sajjanar : నిన్న ఒక్కరోజే 52 లక్షల మంది ప్రయాణించారు.. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Sajjanar : నిన్న ఒక్కరోజే 52 లక్షల మంది ప్రయాణించారు.. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
X

నిన్న (శనివారం) ఒక్క రోజులోనే 52.78 లక్షల మంది ప్రయాణికులను టీఎస్ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. అందులో సగానికిపైగా మహిళా ప్రయాణికులే ఉన్నారని, మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుని ఉచితంగా వారంతా సొంతూళ్లకు వెళ్లారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ బస్సులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో నిన్న ఒక్క రోజే 1,861 ప్రత్యేక వివిధ ప్రాంతాలకు బస్సులను నడిపామని తెలిపారు. అందులో 1,127 హైదరాబాద్‌ సిటీ బస్సులను ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కరీంనగర్‌, వరంగల్, విజయవాడ, ఖమ్మం, తదితర రూట్లలో తిప్పామన్నారు. సంక్రాంతి సందర్బంగా 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని సంస్థ ప్లాన్‌ చేయగా.. ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండటంతో ఈ నెల 11, 12, 13 తేదిల్లోనే 4,400 ప్రత్యేక బస్సులను నడపామని తెలిపారు.

శనివారం వరకు మొత్తంగా 6261 ప్రత్యేక బస్సులను నడపామని అన్నారు. ఆదివారం కూడా 652 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా.. మధ్యాహ్నం వరకు 450 బస్సులను సంస్థ తిప్పిందని చెప్పారు. ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల సంక్రాంతికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ప్రయాణికులను సొంతూళ్లకు సంస్థ చేర్చిందని అన్నారు. తొలిసారిగా బస్‌ భవన్‌ లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసి.. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను ప్రయాణికులు అందుబాటులో ఉంచామని అన్నారు. సంక్రాంతికి ప్రశాంతంగా ప్రజలను సొంతూళ్లకు చేర్చడంలో పాలుపంచుకున్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది, అధికారులకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.




Updated : 14 Jan 2024 12:46 PM GMT
Tags:    
Next Story
Share it
Top