Home > తెలంగాణ > IAS Transfer : తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీ

IAS Transfer : తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీ

IAS Transfer : తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీ
X

రాష్ట్రంలో ఇటీవల కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. తాజాగా మరోసారి ఆరుగురి ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్, పశుసంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్ కుమార్, వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా టి.వినయ్ కృష్ణారెడ్డి, రోడ్లు భవనాల శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్, టీఎస్ఐఆర్డీ సీఈవోగా పి.కాత్యాయని దేవి, గనుల శాఖ డైరెక్టర్ గా సుశీల్ కుమార్ లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 24 Jan 2024 3:42 PM GMT
Tags:    
Next Story
Share it
Top