Home > తెలంగాణ > ఆర్టీసీ బస్సులో యువతి రచ్చ.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఆర్టీసీ బస్సులో యువతి రచ్చ.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఆర్టీసీ బస్సులో యువతి రచ్చ.. అరెస్ట్ చేసిన పోలీసులు
X

హైదరాబాద్ లోని హయత్‌నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఇటీవల నానా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడిన వ్యవహారంలో నిందితురాలైన అంబర్‌ పేటకు చెందిన సయ్యద్‌ సమీనాను రాచకొండ కమిషనరేట్‌ ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో నిందితురాలికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసు విచారణను త్వరతిగతిన చేపట్టి.. నిందితురాలిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులకు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించిన, దాడులకు పాల్పడిన యాజమాన్యం ఏమాత్రం సహించమని అన్నారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. పోలీస్‌ శాఖ సహకారంతో నేరస్తులపై హిస్టరీ షీట్స్‌ తెరిచేలా సంస్థ చర్యలు తీసుకుంటుందని అన్నారు. 45 వేల మంది టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనోవేదనకు గురిచేసే ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. క్షణికావేశంలో సహనం కోల్పోయి దాడులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని సజ్జనార్ సూచించారు.

Updated : 4 Feb 2024 2:27 PM GMT
Tags:    
Next Story
Share it
Top