Home > తెలంగాణ > పండగ వేళ టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన

పండగ వేళ టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన

పండగ వేళ టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన
X

సంక్రాంతి పండగ నేపథ్యంలో ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు నుంచి సొంతూళ్లకు వెళ్లే వాళ్ల కోసం టీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ మీడియాకి తెలిపారు. ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు నుంచి భువనగిరి-యాదగిరిగుట్ట, మోత్కూర్‌/తొర్రూర్‌ వైపునకు వెళ్లే బస్సుల ఆపే స్థలాలను మార్చామని తెలిపారు. హన్మకొండ వైపునకు వెళ్లే బస్సులు యథావిధి స్థానంలో ఆగుతుండగా.. యాదగిరిగుట్ట, తొర్రూర్‌ బస్టాప్‌లను లిటిల్‌ ప్లవర్‌ స్కూల్ సమీపంలోకి మార్చినట్లు పేర్కొన్నారు. ఒక్కో బస్టాప్ ను 300 మీటర్లతో గ్యాప్‌తో ఏర్పాటు చేశామని తెలిపారు. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో మహిళల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కావును ఈ సంక్రాంతికి రెగ్యులర్‌, స్పెషల్‌ బస్సులన్నీ ఉప్పల్‌ క్రాస్‌ రోడ్డు సమీపంలోని ఈ బస్టాప్‌ల నుంచే బయలుదేరుతాయని తెలిపారు. ప్రయాణికులందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని వీసీ సజ్జనార్ తెలిపారు.




Updated : 11 Jan 2024 1:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top