Actress Janhvi Kapoor : తిరుమల శ్రీవారి సేవలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌

Byline :  Veerendra Prasad
Update: 2024-01-05 07:08 GMT

తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాన్వీకపూర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో జాన్వీ స్వామివారి సేవలో పాల్గొన్నారు. తి.తి.దే అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో జాన్వీకపూర్ కు వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.దర్శనం అనంతరం బయటకు వచ్చిన జాన్వీతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. జాన్వీ సంప్రదాయ పట్టుచీరలో వెంకన్న దర్శనానికి వచ్చారు. జాన్వీతోపాటు ఆమె స్నేహితుడు శిఖర్ పహారియా, పిన్ని మహేశ్వరి( గులాబీ హీరోయిన్)తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

జాన్వీ ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర లో నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్సెస్‌ ఈ నెల 8వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. దీనితో పాటు ఓ షార్ట్ టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. వరల్డ్ ఆఫ్ దేవర (World of Devara) దీన్ని విడుదల చేయనుంది యూనిట్. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.దేవర గ్లింప్సెస్ విడుదల కానున్న వేళ.. జాన్వీ కపూర్ తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అదే సమయంలో తిరుమల పర్యటకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్‌ ఫొటోలన జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.




Tags:    

Similar News