ఓం రౌత్ 'రామాయణం' ఎలా ఉంది? మూవీ రివ్యూ

Update: 2023-06-16 07:00 GMT

వాల్మీకి రచించిన ఇతిహాస గాథ రామాయణం. ఈ అద్భుతమైన అలనాటి కావ్యాన్ని ఎంతో మంది దర్శకులు ప్రధానమైన ఘట్టాలను తీసుకుని దృశ్యరూపంగా మలిచి వెండితెరపై ఆవిష్కరించారు. రామాయణం అందరికీ తెలిసిన కథే కానీ నేటి తరానికి ఆ ‘రామాయణం’ గొప్పతనాన్ని చెప్పాలనే ఉద్దేశంతో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను రూపొందించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ రాముడిగా తెరకెక్కించిన చిత్రం ‘ఆదిపురుష్‌’. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ సినిమా శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? రామాయణ గాథను ఓం రౌత్‌ ఎలా ఆవిష్కరించారు? ప్రభాస్ రాముడిగా మెప్పించాడా? తెలుసుకుందాం.

ఆదిపురుష్ కథ ఏమిటంటే :




 

తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం రాముడు వ‌న‌వాసానికి వెళ్లే దగ్గరి నుంచి క‌థ ప్రారంభం అవుతుంది. అపురూప సౌంద‌ర్య‌వ‌తి అయిన అర్థాంగి జాన‌కి , సోదరుడు లక్ష్మణుడితో క‌లిసి అడవులకు పయనమవుతాడు రాముడు. స‌త్యం, ధ‌ర్మ‌మే త‌న ఆయుధాలుగా వ‌న‌వాసంలో గ‌డుపుతుంటాడు . ఈ క్రమంలో లంకేశ్వరుడు త‌న సోద‌రి శూర్ప‌ణ‌ఖ చెప్పిన మాటలు విని సీతను మాయ చేసి అప‌హ‌రిస్తాడు. అశోక‌వ‌నంలో జానకిని బంధిస్తాడు. జాన‌కిని రావణాసురుడు అపహరించాడని తెలుసుకున్న శ్రీరాముడు ఏం చేశాడు? రావణుడి చెర నుంచి సీతను తీసుకువచ్చేందుకు ఎవరి సహాయం తీసుకున్నాడు? చెడుపై మంచి ఎలా గెలిచింద‌న్న‌ది మిగ‌తా క‌థ‌.

అసలు కథ మిస్సైంది :


 



ఇప్పటి ప్రేక్షకుల ఆలోచనలకు అనుగుణంగా ఆధునిక హంగులు జోడించి చిత్రాన్ని రూపొందించాడు ఓం రౌత్ . ప్రేక్షకుడిని అట్రాక్ట్ చేసేందుకు అదిరిపోయే గ్రాఫిక్స్ హంగులను జోడించాడు. అయితే రామాయ‌ణ ఇతిహాసంలోని అసలు విషయాన్ని ప‌క్క‌నపెట్టి, సంద‌ర్భాలను, క్యారెక్టర్స్‎ను సినిమాకి అనుకూలంగా మార్చుకున్నాడు డైరెక్టర్. రావణాసురుడి దీక్ష‌ని మెచ్చి బ్ర‌హ్మ ప్ర‌త్య‌క్ష‌మవుతాడు. తపస్సును మెచ్చి బ్రహ్మ వ‌రాలు ఇవ్వ‌డంతో అస‌లు క‌థ‌ ప్రారంభమవుతుంది. ఆ తరువాత రామాయణంలోని ప్ర‌ధాన ఘ‌ట్టాలు ఒక్కొక్కటిగా వెండితెరపైన వ‌స్తుంటాయి. నిజానికి రామాయణం గురించి ప్రతి భార‌తీయుడికి తెలుసు. అందుకోనేమో క‌థ ప‌రంగా పెద్ద‌గా సినిమా ఆస‌క్తిని రేకెత్తించ‌లేకపోయింది. వ‌రుస ఘ‌ట్టాల‌తో సినిమా సాగిపోతుంది.

విజువల్స్ ఆకట్టుకున్నాయి:


 



ఆదిపురుష్ కథ కంటే విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయట. లంక‌ని తెర‌మీద చూపించన తీరు సినిమాకు హైలెట్ గా నిలుస్తోంది. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ఆ సీన్స్‎ను తీర్చిదిద్దారు. విజువ‌ల్స్‌పైన దృష్టిపెట్టిన ద‌ర్శ‌కుడు కథను వదిలేశాడు. రామాయణానికి ఆయువు పట్టైన భావోద్వేగాల్ని ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. ప్రజలకు భక్తి పార‌వ‌శ్యంలో ముంచే గాథ రామాయణం. రావణుడి కారణంగా జాన‌కి, రాముల మ‌ధ్య ఏర్పడిన ఎడ‌బాటు... హ‌నుమంతుడి విన్యాసాలు, శ్రీరాముడి ఆదర్శాలు, ఇలా ఎన్నో అంశాలను వాడుకుని బ‌ల‌మైన భావోద్వేగాలను పలికించే అవకాశం ఉన్నా డైరెక్టర్ ఆ విషయంలో పూర్ అని ఆదిపురుష్ తో క్లారిటీ వచ్చేసింది. రామ సేతు నిర్మాణం, లంక‌లో రావ‌ణుడిపై పోరాటం చేసేందుకు వానర సైన్యంలో స్ఫూర్తిని నింపే ఘ‌ట్టాలు మిన‌హా ఏవీ కూడా ప్రభాస్ హీరోయిజాన్ని హైలైట్‌ చేసేవిగా లేవు. యుద్ధ స‌న్నివేశాలు కూడా చాలా సాగదీసినట్లు ఉన్నాయి. అందులో విజువల్స్ తప్ప ప్రేక్షకుడిని ఆకట్టుకునే అంశాలు ఏమీ లేవు. ఆదిపురుష్ లో పాత్ర‌లన్నింటినీ తీర్చిదిద్దిన విధానం మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తాయి. క‌థ‌, క‌థ‌నాల విషయం పక్కనపెడితే ఇతరం యువతను, చిన్నారులను అల‌రించే విజువ‌ల్ ఎఫెక్ట్స్‎తో రూపొందిన చిత్ర‌ం ఆదిపురుష్. త్రీడీలో ఈ సినిమాను ప్రేక్ష‌కుల్ని మ‌రింత‌గా అల‌రిస్తుంది.

రాముడిగా ప్రభాస్ ఒదిగిపోయాడు :

ఆదిపురుష్ లో నటించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాపైన వారి ప్రభావం చూపించారు. ఇక రాముడిగా ప్రభాస్ ఒదిగిపోయాడు. స్క్రీన్ మీద ఎంతో సాత్వికంగా, ప్రశాంతంగా ఉంటూ చక్కటి ఎక్స్‏ప్రెషన్స్‎తో అలరించారు. సీత పాత్ర తెరమీద పెద్దగా కనిపించలేదు. కనిపించిన వరకు కృతి సనన్ హుందాగా నటించింది. రావణాసురుడి పాత్రను పోషించిన సైఫ్‎కు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆయన లుక్ కొంత ఆధునికంగా కనిపించింది. లక్ష్మణుడిగా   స‌న్నీసింగ్‌, హ‌నుమంతుడిగా దేవ్‌ద‌త్ పాత్రలు బాగానే మెప్పించాయి.  


Tags:    

Similar News