చైతూ, సమంత లాగే ఆ జంట కూడా.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

Update: 2023-08-17 03:07 GMT

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీనటుల జాతకాలు పబ్లిక్ గా చెబుతూ ఫేమస్ అయ్యారు. సమంత, నాగచైతన్య పెళ్లి చేసుకునే సమయంలో వారిద్దరు విడిపోతారని జోస్యం చెప్పారు. అయిన చెప్పినట్లే జరగడంతో అందరికీ అతని జ్యోతిష్యంపై ఆసక్తి ఏర్పడింది. ఇక రాంచరణ్_ఉపాసన జంట ఆలస్యంగా తల్లిదండ్రులు అవుతారని కూడా గతంలోనే చెప్పారు. అదే నిజం అయింది.




 


2023కు సంబంధించి వేణు స్వామి చెప్పిన పలు విషయాలు నిజం అయ్యాయని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. 2023లో ఒక హీరో చనిపోతాడని వేణుస్వామి చెప్పారు. ఆ హీరో ఎవరు అనేది చెప్పలేదు. కానీ తారకరత్న రూపంలో నిజమైంది అని నెటిజన్లు అంటున్నారు. ఇక ఓ టాలీవుడ్ హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుంటారని చెప్పగా.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ వార్తలతో అది కూడా నిజమైనట్లయింది.రష్మిక మందన , నిధి అగర్వాల్, శ్రీలీల, డింపుల్ హాయతి ఎంతోమంది హీరోయిన్లు జాతక ప్రభావం వల్ల ఈ జ్యోతిష్యుడు చెప్పినట్లు యాగాలు, పూజలు చేశారు.




 


ఈయన చెప్పినట్లుగానే సమంత-నాగచైతన్య, నిహారిక-వెంకట చైతన్య విడిపోయారు. తాజాగా మరొక స్టార్ జంటపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సామ్-చైతూలాగే ఆది పిని శెట్టి, నిక్కి గల్రానీ విడిపోతారంటూ చెప్పుకొచ్చాడు. వీరి జాతకం క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే.. వీరిద్దరు కలిసి ఉండటం అసాధారణమని.. 80 శాతం డివోర్స్ తీసుకునే అవకాశం ఉందని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.




 





Tags:    

Similar News