Bigg boss season 7 : ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు.. హౌస్లో రచ్చ షురూ..

By :  Kiran
Update: 2023-10-09 11:31 GMT

బిగ్బాస్ తెలుగు సీజన్ 7 గేర్ మారింది. ఆదివారం గ్రాండ్ లాంఛ్ 2.0లో భాగంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు హౌస్లో అడుగుపెట్టారు. 5 వారాల తర్వాత కొత్త సభ్యుల రాకతో హౌస్లో హీట్ మరింత పెరిగింది. ఇన్నాళ్లు పడ్డ కష్టమంతా బూడిద పాలైందంటూ పాత హౌస్మేట్స్లో లోపల రగిలిపోతున్నారు. ఇక సోమవారం జరిగిన నామినేషన్స్ అగ్నికి ఆజ్యం పోసిందని ప్రోమోలను చూస్తే అర్థమవుతోంది.

బిగ్ బాస్ కొత్త సభ్యులు హౌస్లోకి అడుగుపెట్టి ఒక్క రోజు గడవక ముందే హౌస్మేట్స్ నామినేషన్కు సిద్ధమయ్యారు. బిగ్ బాస్ ఆదేశాల మేరకు తొలుత ఐదుగురు పోటుగాళ్లు పాత హౌస్ మేట్స్ను నామినేట్ చేశారు. ఆట సరిగా ఆడలేదంటూ నయని పావని టేస్టీ తేజను నామినేట్ చేసింది. ఇక తేజ - గౌతమ్ కృష్ణ బెల్డ్ టాస్క్ సమయంలో సందీప్ సంచాలక్గా సరిగా వ్యవహరించలేదని భోలే ఆయనను నామినేట్ చేశారు. టాస్కుల్లో కనిపించడం లేదంటూ టేస్టీ తేజను పూజమూర్తి, గ్రూపుగా ఆడుతున్నారంటూ అమర్ దీప్, శోభా శెట్టిని అశ్విని, ఆట సరిగా అర్థం చేసుకోవడం లేదని అమర్ దీప్ను అంబటి అర్జున్ నామినేట్ చేశారు. దీంతో శోభ ఒక్కసారిగా ఫైర్ అయింది.

పోటుగాళ్ల నామినేషన్ పూర్దైన తర్వాత బిగ్ బాస్ ఆటగాళ్లకు అవకాశమిచ్చాడు. పోటుగాళ్లలో ఒకరు, ఆటగాళ్లలో ఒకరిని నామినేట్ చేయాలని ఆదేశించారు. దీంతో అసలు రచ్చ మొదైలంది. శివాజీ అమర్ దీప్కు ఇంట్లో కొనసాగే అర్హత లేదని చెప్పగా.. టేస్టీ తేజ నయని పావనిని నామినేట్ చేశాడు. ఇక అమర్దీప్ పూజామూర్తి మధ్య నామినేషన్ విషయంలో పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తోంది. శోభా శెట్టి, ప్రియాంకలు కొత్త కంటెస్టెంట్ అశ్వినిని నామినేట్ చేయడంతో ఆమె కన్నీరు మున్నీరైంది. హౌస్లో ఉండనంటూ శోకాలు పెట్టింది.

Tags:    

Similar News