Chandra Mohan : పంజాగుట్ట స్మశానవాటికలో ముగిసిన చంద్రమోహన్ అంత్యక్రియలు

Byline :  Kiran
Update: 2023-11-13 10:29 GMT

టాలీవుడ్ విలక్షణ న‌టుడు చంద్రమోహన్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖుల అశ్రునయనాల మధ్య హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుమందు ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి పంజాగుట్ట వరకు అంతిమయాత్ర కొనసాగింది. కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. చంద్రమోహన్‌కు కడసారి వీడ్కోలు పలికారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్‌ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో మరుపురాని సినిమాల్లో నటించిన ఆయన సినీ ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా జీవించి ఉంటారని గుర్తు చేసుకున్నారు.


 


Tags:    

Similar News