వెంకయ్య ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు : ఆదిశేషగిరిరావు

By :  Krishna
Update: 2024-01-26 16:35 GMT

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కేంద్రం పద్మ విభూషన్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ క్రమంలో ఆయనకు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి వెంకయ్యను కలిసి ప్రత్యేకంగా అభినందించారు. తాజాగా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ సభ్యులు వెంకయ్యను కలిసి అభినందనలు తెలిపారు. FNCC ప్రెసిడెంట్ ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్ సహా పలువురు వెంకయ్యను కలిశారు.

వెంకయ్య ఎమ్మెల్యే, ఎంపీ, ఉపరాష్ట్రపతిగా దేశానికి, రాష్ట్రానికి ఎంతో సేవ చేశారని FNCC ప్రెసిడెంట్ ఆదిశేషగిరిరావు అన్నారు. ఎంతో మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. సినీ ఇండస్ట్రీకి సైతం ఆయన సన్నిహితంగా ఉంటారని గుర్తుచేసుకున్నారు. అటువంటి వ్యక్తికి పద్మ విభూషణ్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదగిన వెంకయ్య జీవితం ఎంతోమందికి ఆదర్శమని సెక్రటరీ మోహన్ అన్నారు. తెలుగు భాష సహా సంప్రదాయాలను ప్రోత్సహించడానికి ముందుటారని చెప్పారు. వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News