Krish : రాడిసన్ డ్రగ్స్ కేసు.. పోలీసుల విచారణకు క్రిష్

Byline :  Krishna
Update: 2024-02-28 06:42 GMT

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హోటల్ ఓనర్ వివేకానంద్ ఇచ్చిన పార్టీకి డైరెక్టర్ క్రిష్ హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన్ని విచారించేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ విచారణకు రావాలని ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. అదేవిధంగా విచారణ సహకరించాలని సూచించారు. పోలీసుల సూచనతో క్రిష్ విచారణకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ తర్వాతే క్రిష్ డ్రగ్స్ వ్యవహారంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

వివేకానంద్ ఇచ్చిన ఈ పార్టీకి సినీ నటి లిషి కూడా హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను కూడా విచారించనున్నారు. 2022లోనూ ఓ డ్రగ్స్ కేసులో లిషితో పాటు ఆమె సోదరి కుషిత పేరు వినిపించింది. ఇప్పటివరకు ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తరుచూ అదే హోటల్లో పార్టీలు చేసుకుంటామని వివేకానంద్ పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ కేసులో అరెస్టైన సయ్యద్ ఫోన్ లో పలువురి సినీ ప్రముఖుల నంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


Tags:    

Similar News