మహేష్ బాబు బర్త్‎డే రోజున..రాజమౌళి ట్రీట్

Update: 2023-06-13 09:13 GMT

బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి భారీ హిట్ చిత్రాల తరువాత దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’చిత్రం చేస్తున్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‎తో జక్కన్న చేస్తున్న మొదటి చిత్రం కావడంతో ఎలాంటి సినిమా తీయబోతున్నారు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‎గా మారింది. దీంతో చిత్రం ఎప్పుడెప్పుడా అని అటు ప్రిన్స్ ఫ్యాన్స్, ఇటు రాజమౌళి అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా అనౌన్స్ చేసి నెల కావస్తున్నా ఇప్పటి వరకు సినిమా చిత్రీకరణ ప్రారంభం కాలేదు. మహేష్ సమ్మర్ వెకేషన్ టూర్ కారణంగా సినిమా పనులన్నీ పెండింగ్‎లో పడ్డాయి. అందులోనూ ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్‎తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా నత్తనడకన సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా అందిన సమాచారం ప్రకారం ఓ ప్రత్యేకమైన రోజులో రాజమౌళి సినిమా పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది.

మహేష్ పుట్టినరోజున అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారు రాజమౌళి. ఈ ఏడాది బర్త్ డే రోజున జక్కన్నతో సినిమాను ప్రారంభించనున్నారు ప్రిన్స్‌. యాక్షన్‌ అడ్వెంచర్‌ తో రూపొందించనున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 9న మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా లాంచ్‌ చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్. రెండు వారాల్లో అధికారిక ప్రకటన కూడా రానుందని ఇండస్ట్రీ టాక్. ప్రస్తుతంఎస్‌ఎస్‌ఎంబీ 29 స్క్రిప్ట్‌ పనుల్లో బిజీ బిజీగా ఉంది రాజమౌళి అండ్‌ టీమ్‌. భారీ అంచనాలతో, బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రంలో భారీ స్టార్‌క్యాస్ట్‌ ఉండబోతోంది. బాలీవుడ్‌ నటులతోపాటు హాలీవుడ్‌ టెక్నీషియన్లు మహేష్ సినిమాకు పని చేయనున్నారు.

Tags:    

Similar News