జైలు నుంచి విడుదలైన పల్లవి ప్రశాంత్.. 4 రోజుల తర్వాత..

Byline :  Krishna
Update: 2023-12-23 15:08 GMT

బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ జైలు నుంచి విడుదల అయ్యారు. చంచల్‌గూడా జైలు నుంచి తన నివాసానికి వెళ్లాడు. ప్రశాంత్ను చూసేందుకు జైలు వద్దకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. కాగా ప్రశాంత్ నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్నారు. శుక్రవారం నాంపల్లి కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో ఇవాళ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. బిగ్ బాస్ ఫైనల్ తర్వాత జరిగిన గొడవల కేసులో మూడు రోజుల క్రితం పోలీసులు ప్రశాంత్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడు ఏ1 గా ఉన్నాడు.

ఫైనల్ షో అనంతరం కంటెస్టెంట్స్ అందరూ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి వస్తుంటే.. అభిమానులంతా వీరంగం సృష్టించారు. కార్లు, ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. ఇతర కంటెస్టెంట్స్పై దాడి చేసే ప్రయత్నం చేశారు. . దీన్ని తర్వాత పలు సెక్షన్ల కింద ప్రశాంత్పై కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 20న అరెస్ట్ చేశారు. అదే రోజు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Tags:    

Similar News