ఆ ఇద్దరు క్రికెటర్లే నా ఫేవరెట్...జాన్వీకపూర్

By :  Vinitha
Update: 2024-02-25 02:52 GMT

సౌత్ లో శ్రీదేవికి ఉండే ఫాలోయింగ్ వేరు. అతిలోక సుందరిగా ప్రేక్షకులను మైమరపించి తన అందచందాలతో ఆడియన్స్ ను బుట్టలో వేసుకుంది. అలాంటి అందాల తార దివంగత నటి శ్రీదేవి కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. బాలీవుడ్ లో దడక్ అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆమె బాలీవుడ్ నుంచి విరామం తీసుకొని వరుసగా సౌత్ మూవీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో భారీ బడ్జెత్ తో రూపొందుతున్న దేవరలో ఆమె నటిస్తున్నారు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ తో ఆమె జతకడుతున్నారు. అంతేగాక సౌత్ లో మరో రెండు సినిమాల్లో నటించబోతున్నారు జాన్వీకపూర్. రామ్ చరణ్ నెక్ట్స్ మూవీలో యాక్ట్ చేయనుంది ఈ భామ. చిరంజీవి-శ్రీదేవి జోడి ఎంత హిట్టో మనందరికి తెలిసిందే. అదే విధంగా చరణ్ తో జాన్వీ జతకడుతుడడంతో వారి జోడి కూడా హిట్టే అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్యతోనూ ఓ పాన్‌ ఇండియా చిత్రంలో నటించనున్నారు. మహాభారతం ఇతివృత్తంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కర్ణుడిగా సూర్య కర్ణుడిగా కనిపించబోతున్నారు. అందులో సూర్య సతీమణిగా జాన్వీ కపూర్‌ కనిపించనున్నట్లు బోనీకపూర్‌ తెలిపారు. దేవర వంటి భారీ చిత్రంలో తానూ భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు జాన్వీకపూర్.

ఈ చిత్రంలో నటించడం ద్వారా ఇక్కడ తన మూలాలను చేరుకునే అవకాశం కలుగుతోందని తెలిపారు. అంతేగాక తాను ప్రస్తుతం తెలుగు భాషను నేర్చుకుంటున్నానని చెప్పారు. ఇక తనకు ఇండియన్‌ సినిమా, క్రికెట్‌ అంటే చాలా ఇష్టమని తెలిపారు. క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ, దినేష్‌ కార్తీక్‌ అంటే చాలా ఇష్టం అని జాన్వీ కపూర్‌ చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News