అచ్చం వైఎస్ భారతిలాగే ఉందే.. యాత్ర2 సీఎం భార్య ఫస్ట్ లుక్

By :  Kalyan
Update: 2023-12-09 16:00 GMT

మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. దీనికి నిదర్శనంగా చాలామంది కనిపిస్తుంటారు. దర్శకుడు ఆర్జీవి.. అచ్చం నారా చంద్రబాబు నాయుడిలాగే కనిపించే వ్యక్తిని పట్టుకొచ్చి సినిమా తీశారు. సినిమాల్లో నటించే డూప్‌ల సంగతి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని ముమ్మూర్తులా పోలివున్న ఓ నటి ఫోటో వైరల్ అవుతోంది.

వైఎస్ రాజశేఖరెడ్డి బయోపిక్ ‘యాత్ర’ తీసి హిట్ కొట్టిన దర్శకుడు మహి వి రాఘవ్ తీస్తున్న యాత్ర 2 సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాజశేఖర్ రెడ్డి చివరి రోజులు, వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానం, 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం కావడం వంటి పరిణమాలను చూపుతున్నారు. జగన్ భార్య పాత్ర కోసం కేతకి నారాయణన్ అనే మలయాళ నటిని తీసుకున్నారు. ఆమెకు భారతితో దగ్గరి పోలికలు ఉండడంతో ఫోటో వైరల్ అయింది. శనివారం భారతి పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీమ్ కేతకి ఫోటో వదిలింది.

'నిజమేన్నా మా ఇంట్లో ఆడవాళ్లకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడటం కూడా నేర్పించలేదు' ఆ పాత్ర చెప్పే డైలాగును పోస్టర్‌పై అచ్చేశారు. కేతకి నారాయణన్ ఇది వరకు 'ఫక్.. చిట్టి ఉమా కార్తీక్‌' అనే టాలీవుడ్ చిత్రంలో నటించింది.యాత్ర 2లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి, తమిళ నటుడు జీవా సీఎం జగన్‌‌గా, ఆయన తాత రాజారెడ్డిగా జగపతి బాబు, వైఎస్ స్నేహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేశ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏపీ ఎన్నికల నాటికి ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నారు. యాత్ర 1 కూడా 2019 ఎన్నికల సమయం ఫిబ్రవరి 8నే విడుదలై జగన్ గెలుపుకు సాయపడింది.

Similar News